గ్రామ సహాయకులు వేతనం 21వేల రూపాయలకు పెంచాలని పశ్చిమగోదావరి జిల్లా రెవిన్యూ గ్రామ సహాయకుల సమావేశం డిమాండ్ చేసింది.
ఏలూరులో మంగళవారంనాడు పశ్చిమగోదావరి జిల్లా రెవిన్యూ గ్రామ సహాయకుల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెవిన్యూ గ్రామ సహాయకుల అధ్యక్షులు బి గణేశ్వరరావు, జిల్లా రెవిన్యూ అధ్యక్షులు ఎల్ వి సాగర్ అధ్యక్షత వహించారు.
అర్హులైన వి ఆర్ ఏ లను గ్రేడ్2 వి ఆర్ ఓ లుగా పదోన్నతులు కల్పించాలని, అదేవిధంగా జిల్లాలో ఖాళీగా ఉన్న సబార్డినెట్ పోస్టుల్లోనూ డ్రైవర్ ఉద్యోగాలను నైట్ వాచ్ మెన్ లుగాను అటెండర్ వంటి ఉద్యోగాల భర్తీలో వి ఆర్ ఏ ల తో భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు, జె సి కి, మంత్రి తానేటి వనితకు వి ఆర్ ఏ ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వి ఆర్ ఏ ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డి ఎన్. వి డి ప్రసాద్, తాడిగడప గంగాధర్, పండు, బ్రహ్మాజీ, పోసిబాబు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.