పాలకవర్గం సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని నూతన బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ కె. శ్రీనివాసరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి ని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి, ప్రజాసమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా పని చేస్తానని అన్నారు. ప్రజలు అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,కౌన్సిలర్లు అమర బోయిన సతీష్, గంగరాజు కాంట్రాక్టర్ వేముల వెంకన్న,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్