గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ లోని మాడుగుల రోడ్లు మూడవ సచివాలయానికి తాళం వేశారు.
గత ఆరు నెలల అద్దె చెల్లించలేదని ఇంటి యాజమాని సచివాలయానికి తాళం వేశారు.
ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇంటి యజమాని ఈ నిర్ణయం తీసుకున్నారు.
దాంతో సచివాలయం సిబ్బంది బయట కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు.
గురజాల లో మిగిలిన సచివాలయం అద్దె చెల్లింపు విషయంలో కూడా నగర్ కమీషనర్ పట్టించుకోకుండా చూస్తున్నారు.