39.2 C
Hyderabad
April 28, 2024 14: 08 PM
Slider కడప

ఆకస్మికంగా వార్డు సచివాలయం తనిఖీ చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్

#rajampet

సచివాలయ సిబ్బంది ప్రజలకు  అందుబాటులో  వుండి మెరుగైన సేవలు అందించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష అన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కొలిమివీది వార్డు సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ మాట్లాడుతూ సచివాలయాలకు వచ్చే ప్రజలతో సిబ్బంది గౌరవంగా వ్య‌వ‌హ‌రించి తమ పరిధిలో వున్న సేవలను వారికి అందించాలన్నారు.

ప్రజల నుంచి అందిన అర్జీల  నిర్ణీత గడువులోగా పరిష్కరించి బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు. ఈ సందర్బంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, వాలంటీర్ల అటెండెన్స్ రిజిస్టర్ ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్,  తదితర రికార్డులను పరిశీలించారు.

కొలిమివీది సచివాలయ పరిధిలో ప్రజలనుంచి వచ్చిన  అర్జీలు ఎన్ని పరిష్కరించారు. ఎన్ని బియాండ్ ఎస్ ఎస్ ఎ లో వున్నాయి అని సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జగనన్న విద్యా దీవెన, జగన్నతోడు,వంటి వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి 100% డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ ఎప్పటికప్పుడు తీసుకోవాలని ఎట్టి పరిస్థితులలో వీటిని డిలే చేయకూడదన్నారు.

సచివాలయ సిబ్బంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కొలిమివీది సచివాలయ పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎంత మంది జనాభా ఉన్నారు వంటి వివరాలు నేమ్ బోర్డులలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలన్నారు.

సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ పౌర సేవలను  విస్తృతంగా అమలు చేసి ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు. వార్డులలో వార్డు వాలెంటీర్ల పోస్టులు కాలీగా వుంటే వెంటనే కొత్తవారిని నియమించుకవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

వార్డు వాలేంటీర్ల పోస్టులు ఖాళీగా వుండటానికి వీలు లేదన్నారు. సచివాలయంలో అందుతున్న సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కోదండరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి,  సచివాలయ సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

గుర్రంపోడు గిరిజన రైతుల పోరాటానికి బిజెపి సంపూర్ణ మద్దతు

Satyam NEWS

ముఖ్యమంత్రి కెసిఆర్ కి పాలాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు

Satyam NEWS

సరిహద్దుల్లో మొహరించి ఉన్న ఎయిర్ ఫోర్స్

Satyam NEWS

Leave a Comment