రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 48 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయో చెప్పాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెం లో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పర్యటించారు.
గ్రామంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల సమక్షం లో చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడి ప్రజల సాధకబాదకాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా, వైఫల్యాల కారణం గా తాము ఎలా నష్టపోయామో వివిధ వర్గాల ప్రజలు తెలిపారు. ఉదయ్ కుమార్ అనే యువకుడు దళిత వర్గానికి చెందిన తనకు నాటి ప్రభుత్వం ద్వారా ఎలా నష్టం జరిగిందో వివరించాడు.
సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్య తోనే యువత జీవితాల్లో మార్పు వస్తుందని అన్నారు. సాంకేతిక విద్యకు నాడు ఇచ్చిన ప్రాధాన్యం తోనే యువతకు విస్తృతం అవకాశాలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో ఒక్క రైతు కూడా సంతోషం గా లేడని, రైతు కు జగన్ ఇస్తాను అన్నది ఎంత…..ఇస్తుంది ఎంత? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం రైతుకు ఇచ్చే సొమ్ము కూడా తానే ఇస్తున్నట్లు జగన్ చెప్పుకుంటున్నాడని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో రైతుల మోటార్లకు వద్దన్నారు… మరి జగన్ ఎందుకు AP లో అంగీకరించారు అని ఆయన ప్రశ్నించారు. గతి లేని రైతులే వరి పంట వేస్తున్నారని ఒక మంత్రి వ్యాఖ్యానించారని, ఎలా అంటారు? అని చంద్రబాబు ప్రశ్నించారు.