బిచ్కుంద మండల కేంద్రంలో గల మహా ప్రసిద్ధ సంస్థాన మఠం బండాయప్ప స్వామి సంస్థాన మఠంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. చివరి రోజు కుస్తీ పోటీలు నిర్వహించి ఉత్సవాలను ముగిస్తారు. ఈ సందర్భంగా మఠాధిపతి సోమప్ప స్వామి కుస్తీ పోటీలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కుస్తీ పోటీలకు తెలంగాణ మహారాష్ట్ర కర్నాటక సరిహద్దు ప్రాంతాల నుండి మల్లయోధులు భారీ సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు.
పోటాపోటీ పోటీల్లో చివరిగా గెలుపొందిన ఇద్దరికి 1500 చొప్పున మఠాధిపతి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమప్ప స్వామితో పాటు సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ (బాలు)యువకులు బొమ్మల నాగేశ్, యోగేష్ పాటిల్, గణేష్ గోoడా, చింతల సీను, అవార్ సీను, డాక్టర్ రాజు బండాయప్ప, సంపంగి శంకర్ తదితరులు పాల్గొన్నారు.