గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రతిష్టాత్మకంగా విజిబుల్ పోలీస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మంగళగిరి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని పట్టణ సి ఐ శీలం శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.
ఈవ్ టీజింగ్,చైన్ స్నాచింగ్,ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు మంగళగిరి పట్టణ సి ఐ శీలం శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఆటో నగర్ లోని వివిధ ఐ టి కంపెనీల్లో సుమారు 600 మంది యువతులు విధులు నిర్వహిస్తున్నారు.
ఉదయం,సాయంత్రం వేళల్లో ఆటో నగర్ లోని కూడళ్లలో గస్తీలు నిర్వహిస్తున్నట్లు సి ఐ తెలిపారు. తద్వారా ఈవ్ టీజింగ్ ను తగ్గించటంతో పాటు యువతుల్లో మనో స్థైర్యాన్ని నింపగలుగుతున్నామని సి ఐ పేర్కొన్నారు.