వాయిస్ ఆఫ్ హైదరాబాద్ 23 ఆఖరి రౌండ్ మరియు ముగింపు కార్యక్రమం ఈ నెల మార్చి 18న సీబీఐటీ క్యాంపస్లో జరగనుందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం చైతన్య స్పందన, చైతన్య గీతి క్లబ్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మొత్తం 600 మంది గాయకులు ఈ కార్యక్రమం కోసం రిజిస్టర్ చేసుకున్నారని ఆయన వివరించారు. జూనియర్ విభాగం నుంచి 23 మంది, సీనియర్ విభాగం నుంచి 35 మంది చివరి రౌండ్కు ఎంపికయ్యారు. ఎంపికయిన వాళ్లు ఎక్కువమంది తెలుగు రాష్ట్రాల నుంచి వున్నారని కళాశాల పిఆర్ఓ డాక్టర్ జిఎన్ఆర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్ గా సిటీ విజన్, శ్రీ తేజస్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్డ్ చేస్తున్నాయని తెలిపారు.
next post