37.2 C
Hyderabad
May 2, 2024 12: 16 PM
Slider కర్నూలు

ఏసీబీ కి పట్టుబడిన జలకనూరు VRO వెంకట రమణారెడ్డి

#acb

నంద్యాల జిల్లా మిడుతూరు మండలము జలకనూరు గ్రామానికి చెందిన వెంకట రమణయ్య తన ముగ్గురు కూతుర్ల పేరిట తన భూమిని దాన విక్రయముగా రిజిస్టరు చేయించాడు. సదరు భూమిని తన పేరు నుండి వారి పేర్లపై ఆన్లైన్ లో మార్పు చేసి పాసు బుక్కులు ఇవ్వడానికి VRO వెంకట రమణా రెడ్డి  ఫిర్యాదుదారుడైన వెంకట రమణయ్య నుండి పదివేల రూపాయలు లంచం ఆశించాడు. ముందుగా రూ.3000 తీసుకుని మిగిలిన రూ. 7000 లంచం మిడుతూరు గ్రామంలోని తన ప్రైవేటు కార్యాలయంలో తీసుకుంటూ ఉండగా బుధవారం నాడు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ దాడులలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు తేజేశ్వర్ రావు, వెంకట కృష్ణారెడ్డి, ఇంతియాజ్ అహ్మద్, కృష్ణయ్య, వంశినాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలియజేశారు.

ప్రజలకు ఏసీబీ డీఎస్పీ విజ్ఞప్తి

మీ చట్టబద్దమైన పనిని చేయడానికి ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచము ఆశిస్తే ముందుగా 14400 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి గాని 14400 మొబైల్ ఆప్ ద్వారాగాని సమాచారమును అందించగలరు. సదరు లంచగొండి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి కోరారు.

Related posts

మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమం

Bhavani

బంజారాహిల్స్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

ప్రయివేటు ఆసుపత్రులను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment