నెల్లూరు జిల్లా వి.ఎస్. యు టూరిజం విభాగం లో సహాయ అధ్యాపకునిగా విధులు నిర్వర్తిస్తున్న డా. కోట నీల మని కంఠ ను వి.ఎస్. యు. కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గా నియమితులయ్యారు.
ఈ మేరకు ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శన రావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఉత్తర్వుపత్రాలను డా. మని కంఠ ఉపకులపతి చేతుల మీదుగా రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్. ఆచార్య సుజా ఎస్. నాయర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డా. జి. సుజాయ్ సమక్షం లో అందుకున్నారు.
ఉపకులపతి, రిజిస్ట్రార్, డా. మణి కంఠ ను ప్రత్యేకంగా అభినందించారు. డా. మణికంఠ సహాయ అధ్యాపకునితో పాటు, పి జి సెట్ కో కన్వీనర్గా, పి ఆర్ ఓ గా, గాంధీ అధ్యయన కేంద్రం కో ఆర్డినటర్ గా, ఎక్సఅమినషన్ విభాగంలో వివిధ స్థాయిలలో విశ్వవిద్యాలయానికి సేవలు అందించారు.
ఉపకులపతి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేయాలని, ఈ తరహా పదవి విశ్వవిద్యాలయ చరిత్రలో మొదటిది అని అన్నారు.
తనపై నమ్మకముంచి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన వంతు కృషిని చేస్తానని సంతోషం వ్యక్తపరచారు. విశ్వవిద్యాలయ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది డా. నీల మణి కంఠ ను అభినందించారు.