తెరాస శ్రేణులు ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇచ్చిన 10 వేల రూపాయల వరద సహాయం మింగేసిన వైనం. తెరాస ప్రభుత్వ వైఖరికి ఇదొక మచ్చు తునక అని తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు.
10వేల వరద సహాయం తమకు అందటం లేదని రోడ్డెక్కిన వెయ్యి మంది తార్నాక లోని పర్తీవాడ వాసులు, సీతాఫలుమండి ఫ్లై ఓవర్ పై బైఠాయించిన బస్తి వాసులు, తమకు 10 వేల ఆర్థిక సహాయం అందే వరకు ఆందోళన చేస్తాం అంటున్నారని ఆమె అన్నారు.
చచ్చిన శవాలను పీక్కు తినే రాబందులు చూసాం గాని, ఇలా పేద వాళ్ళను వరద సాయం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా, వాళ్ళ వాళ్ళైతే ఇవ్వడం లేకపోతే కొంతమందికి 2 వేలు, కొంత మందికి 5 వేలు మిగిలిన వాళ్లకు అస్సలు ఇవ్వక పోవడం ఎక్కడ చూడలేదని ఆమె అన్నారు.
ఇదెక్కడి సమన్యాయం? ఇదేనా మనం కలలు కన్న బంగారు తెలంగాణ? అని కాట్రగడ్డ ప్రసూన ప్రశ్నించారు. వరద సహాయం లో చేతి వాటాల పైన చర్య తీసుకొని పేదలకు సత్వరమే న్యాయ జరిగేలా చూడాలని ఆమె కోరారు.