సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని రఘునాధపాలెం గ్రామంలోని పావురాల కుంట(ఉరచెఱువు)కు వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణ కోసం గుండ్లపల్లి లిఫ్ట్ నుండి నీటిని సర్పంచ్ పఠాన్ జాన్ బి తన స్వంత ఖర్చులతో నింపుతున్నారు.
ఈ సందర్భంగా పఠాన్ జాన్ బి మాట్లాడుతూ ఈ చెఱువు నింపడం ద్వారా గ్రామంలో నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా చెఱువును నింపుతున్నట్లు ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు పఠాన్ హఫీజ్ ఖాన్,సాముల పుల్లారెడ్డి,యరెద్దు సుధాకర్ రెడ్డి, పందిరి ప్రతాప్ రెడ్డి,పెద్దిబోయిన సీతారాములు,అల్లిస,పెద్ద హసన్ సా తదితరులు ఉన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్