39.2 C
Hyderabad
April 28, 2024 11: 24 AM
Slider నల్గొండ

పావురాల కుంటకు నీరు తరలింపు

#pavuralacheruvu

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని రఘునాధపాలెం గ్రామంలోని పావురాల కుంట(ఉరచెఱువు)కు వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణ కోసం గుండ్లపల్లి లిఫ్ట్ నుండి నీటిని సర్పంచ్ పఠాన్ జాన్ బి తన స్వంత ఖర్చులతో నింపుతున్నారు.

ఈ సందర్భంగా పఠాన్ జాన్ బి మాట్లాడుతూ ఈ చెఱువు నింపడం ద్వారా గ్రామంలో నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా చెఱువును నింపుతున్నట్లు ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు పఠాన్ హఫీజ్ ఖాన్,సాముల పుల్లారెడ్డి,యరెద్దు సుధాకర్ రెడ్డి, పందిరి ప్రతాప్ రెడ్డి,పెద్దిబోయిన సీతారాములు,అల్లిస,పెద్ద హసన్ సా తదితరులు ఉన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నేరస్తులను పట్టుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడండి

Satyam NEWS

ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు

Satyam NEWS

ఒంటిమిట్టలో హంస వాహనం పై కోదండ రాముడు

Satyam NEWS

Leave a Comment