మన ఇంటి పరిసర ప్రదేశాలని శుభ్రంగా ఉంచుకోవాలని వారికి జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన న్యూ పటేల్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏస్ఏఫ్ఏ సిబ్బందితో కలిసి బస్తీలలో పర్యటించి చెత్తాచెదారాన్ని తొలగించారు. అలాగే స్థానిక బస్తీ ప్రజలతో మాట్లాడుతూ పారిశుద్ధ సిబ్బంది కూడా ప్రతి గల్లి నీ శుభ్ర పరచాలని, ఎక్కడ కూడా చెత్త ఉండకుండా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏస్ఏఫ్ఏ పారిశుద్ధ సిబ్బంది, ఉమేష్,విజయ్, , బస్తి ప్రజలు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, మహేష్ ముదిరాజ్, మధు, వేణు, సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట