పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రేపు నిర్వహిస్తున్న దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోర కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు Md చాంద్ పాషా కోరారు. దళిత, గిరిజన జాతికి ఏడున్నరేళ్లలో సీఎం కేసీఆర్ చేసిన మోసాలను ఎండగడుతూ మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలో ఈ సభ జరుగుతున్నది. ములుగు మండలంలోని ప్రతి గ్రామం నుంచి దళిత, గిరిజన నాయకులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నలెల్ల కుమారన్న ఆధ్వర్యంలో సభను విజయవంతం చేయాలని చాంద్ పాషా కోరారు. అదేవిధంగా ములుగు మండలం లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల జిల్లా నాయకులు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సింగిల్ విండో చైర్మెన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ అధ్యక్షులు, గ్రామాల్లోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, సీతక్క అభిమానులు, రేవంత్ రెడ్డి అభిమానులు భారీ సంఖ్యలో హాజరయి సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.