సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది అంబర్ పేట్ కి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు సి.నరసింగరావు ముదిరాజ్ కు కరోనా సోకిందని పది రోజుల కిందట సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చేర్పించారు. ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల వరకు డబ్బులు కట్టించుకున్నారు.
అయితే నిన్న ఆయన చనిపోయాడని ఇంకా ఐదు లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు యశోద హాస్పిటల్ వారు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి మరలా మరోసారి ఎంక్వయిరీ చేయగా ఆయన బతికే ఉన్నాడని వీడియో కాల్ లో చూపించారు. దీనికి కంగుతిన్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇది సికింద్రాబాద్ లో ఉన్న యశోద హాస్పిటల్ నిర్వాకం.