42.2 C
Hyderabad
May 3, 2024 17: 07 PM
Slider కడప

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గణేష ఆగ్రహానికి గురికాక తప్పదు…

#bhatyala

కడప జిల్లా రాజంపేటలో ని టీడీపీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భత్యాల మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గ పరిధిలో అన్నీ చోట్లా వినాయక విగ్రహాలు భక్తులు సొంత ఖర్చుతో పెడతారని, టీడీపీ నేతలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుకల్లో పాల్గొంటా మని వెల్లడించారు.వినాయకమయ్యా తో పాటూ మమ్మలి అందరిని అరెస్ట్ చేసినా కేసులకు భయపడమని అన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని మతాలను సమానంగా చూడాలని కోరారు.వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా చేరి సమావేశాలు చేసుకుంటే కోవిడ్ రాదా, హిందువులు పండుగలు చేసుకుంటే మాత్రమే కోవిడ్ వస్తుందా అని ప్రశ్నించారు.

కోవిడ్ నిబంధనలు డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్ ఇండియా చేతిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కు హక్కు లేదని అన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ విజ్ఞవినాయకుని ఆగ్రహం చవి చూడక తప్పని హెచ్చరించారు.

Related posts

నేరరహిత సమాజంగా మార్చడానికి సీసీ కెమేరాలు దోహదం

Satyam NEWS

600 బడుల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు

Bhavani

హ్యాపీ బర్త్ డే:ఘనంగా రమేష్ బాబు జన్మ దిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment