38.2 C
Hyderabad
April 27, 2024 18: 48 PM
Slider కర్నూలు

డోన్ సీఐ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి

#dhone

చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తూ అవినీతికి పాల్పడుతున్న డోన్ పట్టణ సి.ఐ మల్లిఖార్జున ను విధుల నుండి తప్పించకుండా నంద్యాల జిల్లా S.P , రాయలసీమ రేంజ్ డీ.ఐ.జి  చోద్యం చూస్తూ సి.ఐ కి కొమ్ము కాస్తున్నారని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి ఆరోపించారు. డోన్ పట్టణ సి.ఐ మల్లిఖార్జున పోలీసు ఉద్యోగానికి అనర్హుడని, ప్రజల పట్ల సామరస్యంగా ప్రవర్తించకుండా,గట్టి గట్టిగా అరుస్తూ ” రా చూసుకుందాం” అని స్టేషనుకు వచ్చే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటాడని అన్నారు.

వీటన్నింటిని చూస్తూ ఉన్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సదరు సి.ఐ పై చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. భార్యాభర్తల మధ్య చిన్న పాటి సమస్యలు వచ్చినప్పుడు వారి ఫిర్యాదు పట్ల కౌన్సిలింగ్ చేయకుండా తనకు ఇష్టం వచ్చినట్లు ఫిర్యాదు వ్రాయించి బాధితురాలి చేత సంతకం చేయించుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆమె అన్నారు.

అన్యాయానికి పాల్పడిన భర్తకు మద్దతు ఇస్తూ, బాధితురాలైనా మహిళను తన ముగ్గురు ఆడపిల్లలను రోడ్డున పడేసిన సి.ఐ చర్యల పట్ల జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ మౌనంగా ఉండడంలో మతలబు ఏమిటి..? అని ఆమె ప్రశ్నించారు. అదే విధంగా బేడ బుడగ జంగాల కులంలో ఉన్న డబ్బు కట్టడి పద్ధతి పంచాయతీలు పోవాలని మరియు బాల్య వివాహాలు జరగకుండా చూడాలని మహిళా సంఘాలు అంతా కలిసి జిల్లా కలెక్టర్లకు, పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇస్తూ పోరాడుతుంటే మరో ప్రక్క డోన్ సి.ఐ మల్లిఖార్జున లంచాలకు పాల్పడుతూ బాల్య వివాహాలను ప్రోత్సహిస్తూ, లక్షల రూపాయలు కట్టడి కట్టి టెంట్లు వేసుకుని కుల పెద్దలు పంచాయతీలు చేస్తుంటే ఆయన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

అక్కడ గొడవలు జరిగి బాధితులకు తలలు పగిలి నెత్తురు చిందినా పట్టించుకోని డోన్ సి.ఐ మల్లిఖార్జున అవినీతి బాగోతం జిల్లా ఉన్నతాధికారులకు కనపడవా.. వినబడువా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇలాఖాలో బుడగజంగాల వారు బాల్య వివాహాలు, లక్షల రూపాయల డబ్బు కట్టడి పంచాయితీలు చేసుకుంటున్నారని, మంత్రి ఆశీస్సులతో డోన్ సి.ఐ సహకారంతో కులపెద్దలు వ్యవహరిస్తుంటే డోన్ పోలీసు అధికారులు చోద్యం చూస్తూ వున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ , సంచార జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రాక్షల ఇందిరమ్మ , బేడ బుడగ జంగం మహిళా సంఘం నాయకురాలు శిరిగిరి లక్ష్మీ , నాగమ్మ , ఈబూతి సాలేశ్వరి, ఈబూతి పుల్లమ్మ , ఈబూతి ఎల్లమ్మ , ఈబూతి అంజనమ్మ , ఈబూతి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోగులకు మేము ఉన్నామనే భరోసా ఇవ్వండి

Satyam NEWS

ఈ పసిపిల్లలకు ఉన్న జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందో……?

Satyam NEWS

కొల్లాపూర్ సమీపంలో తుఫాన్ వ్యాన్ బోల్తా

Satyam NEWS

Leave a Comment