మానవ బలహీనతలపై మనతో ఎలా ఆడుకోవాలో సైబర్ నేరగాళ్లకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. మానవ బలహీనతలను అడ్డంపెట్టుకుని మనలో సెంటిమెంట్లను రెచ్చగొడుతూ జీవితాలను దుర్భరం చేయడం సైబర్ నేరగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.
ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం బయట పడేసుకోవడానికి, మన సాటి వారు ఈ విధమైన సైబర్ నేరాలకు గురి కాకుండా ఉండటానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం వారు సింబయాసిస్ లా స్కూల్ లీగల్ ఎయిడ్ సెంటర్ తో కలిసి నేటి సాయంత్రం 4 గంటలకు ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Social Engineering – The Human Weakness అనే అంశంపై CybHER క్యాంపెయిన్ లో భాగంగా నేడు ఈ ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సైబర్ జాగృతి వ్యవస్థాపకుడు రూపేష్ మిట్టల్ ఈ లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన పలు అంశాలను వివరిస్తారు.
సమాచార సేకరణలో మైండ్ ట్రిక్స్, మనపై చూపే ప్రభావం దానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన అంశాలను రూపేష్ మిట్టల్ వివరిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సైబర్ ప్రపంచంలో ఉంటూనే పూర్తి రక్షణ పొందవచ్చు.
(తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం నుంచి సత్యం న్యూస్ కు ప్రత్యేకం)