వై ఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో ఏపీసీసీ చీఫ్గా షర్మిల పేరును ప్రకటించే అవకాశం ఉంది. హైకమాండ్ ఆదేశంతో పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు గిడుగు రుద్రరాజు అందచేశారు. మణిపూర్లో ఏపీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చారు.