38.2 C
Hyderabad
April 28, 2024 20: 20 PM
Slider నల్గొండ

ఖమ్మంలో జరిగే షర్మిల ‘సంకల్ప సభ’ను జయప్రదం చేయండి

#YSSharmila

9వ తేదీన ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ లో వైయస్ షర్మిల అధ్యక్షతన జరగనున్న సంకల్ప సభను వైఎస్ఆర్ అభిమానులు జయప్రదం చేయాలని వైయస్ షర్మిల ముఖ్య అనుచరుడు హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సీతారాంనగర్ లోని ఎస్ ఆర్ లాజిస్టిక్స్ నందు గురువారం వై యస్ ఆర్ అభిమానుల ముఖ్య కార్యకర్తల సమావేశం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 9వ, తేదీ శుక్రవారం ఖమ్మంలో జరగబోయే సంకల్ప సభను జయప్రదం చేయడానికి నియోజకవర్గ వైఎస్సార్ అభిమానులతో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ఆదెర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల పార్టీ ఎందుకు పెట్టబోతున్నారనే విషయంపై సంకల్ప సభలో తెలియపరుస్తారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అభిమానులు సంకల్ప సభకు భారీగా తరలి రానున్నారని, హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి సుమారు 3 వేల మందికి పైగా వైయస్సార్ అభిమానులు స్వచ్ఛందంగా ఈ సభలో పాల్గొంటారని అన్నారు.

సంకల్ప సభకు తరలి వచ్చే అభిమానులందరూ కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఏడు మండలాల వైఎస్ఆర్ అభిమానులు అంజి,చారి,కోటి,కళింగ రెడ్డి,రాజా రమేష్,కందుల నరసింహారెడ్డి, అరిగెల రవి,సుతారీ శ్రీను,మారాగాని సైదులు, గొట్టె వెంకటేష్, వల్లపుదాసు నాగరాజు, యాసిన్,అహ్మద్,రామారావు, కస్నా నాయక్,బాబు నాయక్,సతీష్ రెడ్డి,జనార్ధన్ రెడ్డి,బాబు,షాహిద్, తిరుపతి రెడ్డి,మస్తాన్ రెడ్డి, రాధా రెడ్డి, దోర్సాల కృష్ణారెడ్డి,వెంకట రెడ్డి, మాతంగి వెంకటేశ్వర్లు, తమ్మారం కృష్ణారెడ్డి, కోటేశ్వరరావు, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నెల్లూరుకు దక్కిన పిఎం కిసాన్ అవార్డు

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ రద్దు చేసాకే కేసీఆర్ కామారెడ్డి రావాలి

Satyam NEWS

విజయనగరం జిల్లా మత్స్యకార గ్రామాల్లో పోలీసుల చైతన్య కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment