26.7 C
Hyderabad
April 27, 2024 08: 44 AM
Slider నెల్లూరు

నెల్లూరుకు దక్కిన పిఎం కిసాన్ అవార్డు

#PMKisanAward

కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పి.ఎం కిసాన్ అవార్డు సొంతం చేసుకుని వ్యవసాయరంగంలో నెల్లూరు జిల్లా రాష్ట్ర ఖ్యాతిని దేశమంతా చాటింది.

న్యూఢిల్లీ లోని పుసా ఏరియాలో ఏపీ షిండే హాల్ లోని NASC కాంప్లెక్స్ లో నిర్వహించిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదగా జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పీఎం కిసాన్ జాతీయ అవార్డును అందుకున్నారు.

పీఎం కిసాన్ పోర్టల్ కి వచ్చిన గ్రీవెన్స్ పరిష్కరించడంలో నెల్లూరు జిల్లా దేశంలోనే మొదట స్థానంలో నిలవడంతో జిల్లాకు కేంద్ర వ్యవసాయ శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, నెల్లూరు వ్యవసాయ శాఖ జెడి ఆనంద కుమారి, ఎ.డి. అనిత పాల్గొన్నారు.

Related posts

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కన్నీటి నివాళి…

Satyam NEWS

షూటింగ్ ఛాంపియన్ ఈశాసింగ్ కు అభినందన

Satyam NEWS

దక్షిణ భారత దేశానికి మండస్ తుపాను ప్రమాదం

Satyam NEWS

Leave a Comment