హైదరాబాద్లో నేడు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒక వైసీపీ నేత కొడుకు అరెస్టు అయ్యారు. ఎస్సార్ నగర్లోని ఒక అపార్ట్మెంట్పై దాడి చేసిన నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ అపార్ట్మెంట్లో నెల్లూరు జిల్లాకు చెందిన యువకుల పార్టీ చేసుకుంటున్నారనే సమాచారం అందడంతో నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడి చేశారు. అక్కడ పట్టుబడిన వారిలో ఓ రాజకీయ నాయకుడు కుమారుడు కూడా ఉన్నాడు. పట్టుబడిన కార్లలో ఆ రాజకీయ నేతకు చెందిన కారు కూడా ఉన్నది.
నెంబర్ ప్లేట్పై నుడా ఛైర్మన్ అని స్టిక్కరింగ్ ఉంది. పట్టుబడిన వారిలో నుడా ఛైర్మన్ ద్వారకానాద్ కుమారుడు ప్రేమ్ కూడా ఉన్నాడు. ప్రేమ్ బర్త్డే పార్టీ కోసం డ్రగ్స్ తీసుకొచ్చారని నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించారు. పట్టుబడిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారు. దాదాపు 30 మంది డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారన్నారని నార్కోటిక్ బ్యూరో సభ్యులు తెలిపారు. గోవా నుంచి క్స్టెన్సీ పిల్స్ తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు.