29.7 C
Hyderabad
May 2, 2024 06: 20 AM
Slider కడప

భూ కబ్జా అడ్డుకున్న టీడీపీ నేతలపై వైసీపీ దాడి

#attack

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం రాజుపాలెం గ్రామపంచాయతీలో వైసీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయి. భూకబ్జా విషయంలో టిడిపి నాయకులపై వారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గంగసాని శేఖర్ రెడ్డి, గంగసాని మీరరెడ్డి, గంగసాని వెంకట సుబ్బారెడ్డి, గంగసాని సుబ్బమ్మ, ఇతర టిడిపి నాయకులు గాయపడ్డారు.

దాడి చేసిన వారిలో బద్వేలు మండల పరిషత్ ఉపాధ్యక్షులు బుట్టి నరసింహారెడ్డి, వారి సోదరులు బుట్టి చంద్రశేఖర్ రెడ్డి,బుట్టి బుజ్జి రెడ్డి,బుట్టి హరికృష్ణ రెడ్డి, బుట్టి విజయ నరసింహారెడ్డి, బుట్టి చిత్తనందం రెడ్డి,పోకల శ్రీనివాసులరెడ్డి ఉన్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. టిడిపి నాయకులు పై దాడి  చేసిన వైస్సార్సీపీ నాయకులు ను వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు.

Related posts

విజయనగరం కార్పోరేషన్ తొలిఎన్నికలలో అతి తక్కువ పోలింగ్

Satyam NEWS

తుడుందెబ్బ నర్సింగరావు కుటుంబానికి జాగృతి అండ

Satyam NEWS

తెలంగాణ ఉద్యమ నేత పిడమర్తి రవికి MLC ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment