కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఎందరో సహాయం చేస్తున్నారు. నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీ వాసులు, యూత్ కమిటీ సభ్యులు అదే బాటలో నడుస్తూ తమకు చేతనైన సాయం చేస్తున్నారు. 26 మంది కలిసి కరోనా వైరస్ పై పోరాటానికి సహాయంగా 23 వేల ఐదు వందల రూపాయలు సేకరించారు.
ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ కు నేడు అందచేశారు. కలెక్టర్ కు విరాళం చెక్కును అందచేసిన వారిలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కుంట కృష్ణమోహన్, లక్మ సతీష్, అడప శ్రీకాంత్ కాలనీ వాసులు ఉన్నారు.