35.2 C
Hyderabad
May 29, 2023 20: 51 PM
Slider ఆదిలాబాద్

‘బాస‌ర‌’ ఆల‌య పునఃనిర్మాణానికి  శ్రీకారం

#indrakaranreddy

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జ‌రిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, అమ్మ‌వారి ఆల‌య పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సరస్వతి అమ్మవారి గర్భాలయ పునఃనిర్మాణంతో పాటు ఇత‌ర అభివృద్ధి ప‌నులకు ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డితో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  శుక్ర‌వారం భూమి పూజ చేశారు.

ఆలయ పునర్నిర్మాణానికి  సీయం కేసీఆర్  రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే రూ.8కోట్ల వ్యయంతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు, తదితర పనులు చేప‌ట్ట‌గా, రూ.22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్ర‌మంలో క‌లెక్ట‌ర్ వ‌రుణ్ రెడ్డి, ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి విజ‌యరామారావు, ఇత‌ర అధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Related posts

ఏపి హైకోర్టు తీర్పును వక్రీకరిస్తున్న జగన్ రెడ్డి

Satyam NEWS

కరోనాతో హౌసింగ్  బోర్డు డిప్యూటీ ఈఈ శ్యామల్  మృతి

Satyam NEWS

కామారెడ్డి జిల్లాలో సాదాసీదాగా గణతంత్ర వేడుకలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!