పేదింటి ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశ్యంతో ఒక అన్నగా, తోబుట్టువుగా ప్రతి సంవత్సరం ఒక చీరను కానుకగా సిఎం కేసిఆర్ అందజేస్తున్నారని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ నేరేడుచెర్ల మండల రెవిన్యూ కార్యాలయంలో శనివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాంస్కృతి సంప్రదాయాలకు నిలయమని, పూలను దేవతలుగా కొలిచే రాష్ట్రం ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని అన్నారు.
అనతరం నేరేడుచెర్ల మండలం లోని 36 మంది కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు 30,03,480 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో RDO వెంకటరెడ్డి, ఎంపిపి లకుమల్ల జ్యోతి, జెడ్పిటిసి రాపోలు నర్సయ్య, DCCB డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి,
వైస్ ఎంపిపి తాళ్ళూరి లక్ష్మినారాయణ, మున్సిపల్ ఛైర్మన్ చందమళ్ళ జయబాబు, వైస్ ఛైర్మన్ చల్లా శ్రీలతరెడ్డి, మండల పార్టీ అద్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి ,ఉపాద్యక్షుడు ఆనంతు శ్రీను, టిఆర్ఎస్ నాయకులు అరిబండి సురేష్ బాబు, తహసిల్దార్, MPDO తదితరులు పాల్గొన్నారు.