40.2 C
Hyderabad
April 29, 2024 16: 44 PM
Slider ఆదిలాబాద్

వైయస్ఆర్ ను స్మరించుకున్న కాంగ్రెస్ అభిమానులు

#YSR Birthday

కొమురం భీం జిల్లా పెంచికల్పేట్ మండలంలో కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు వై యస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలు స్వీకరించి తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికి చెరగని ముద్ర వేసుకున్నారని, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా రూపుదిద్దు ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారని అన్నారు.

పేద ప్రజలకు గుండె చప్పుడు అయిన వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ 108 అంబులెన్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ రుణమాఫీ రైతులకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఆ మహా నాయకుడు భౌతికంగా మన మధ్యలో లేకున్నా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు శంకర్ గౌడ్, నాయకులు మధుకర్ గణపురం నాగేష్ కొలిపాక శ్రీనివాస్ ఆరేకుల సిర్పూర్ నియోజకవర్గ అధ్యక్షులు చప్పిడి సత్యనారాయణ  బాపూజీ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

మీడియా కట్: సాక్షి ఉంటే చాలు మీరంతా మాకెందుకు?

Satyam NEWS

మరో ఐదేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేరు

Murali Krishna

స్త్రీ జాతి చైతన్యం కోసం పరితపించిన గుడిపాటి వెంకటాచలం

Bhavani

Leave a Comment