33.7 C
Hyderabad
April 29, 2024 02: 42 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ సీఎంతో కంచి కామకోటి పీఠం ధర్మాధికారి భేటీ

#kcr

కంచి కామకోటి పీఠం (ధర్మాధికారి ) శ్రీకార్యం బ్రహ్మ శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి, పీఠం ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రమణ్య శాస్త్రి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రగతిభవన్ లో కలిశారు.

కంచి కామకోటి పీఠం లో జరుగుతున్న శ్రీవిద్యా యాగం లో పాల్గొనాల్సిందిగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు.

అదేవిధంగా కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న సంప్రదాయ పాఠశాల ఇతర కార్యకలాపాల కోసం హైదరాబాదులో స్థలం కోసం వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి  వారికి అనువైన చోట పీఠానికి స్థలం ఇవ్వడానికి హామీ ఇచ్చారు.

అదేవిధంగా కంచి కామకోటి పీఠం కార్యకలాపాల గురించి ముఖ్యమంత్రి కంచికామకోటి పీఠం శ్రీకార్యం చల్లావిశ్వనాధ శాస్త్రి ద్వారా దాదాపు గంటసేపు చర్చించి అన్ని విషయాలు తెలుసుకున్నారు.

Related posts

ప్రవీణ్ కుమార్ జోలికొస్తే సహించం

Bhavani

హైకమాండ్ టెస్టింగ్: రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష

Satyam NEWS

కాంగ్రెస్ గూటికి చేరబోతున్న వివేకా కుమార్తె సునీత

Satyam NEWS

Leave a Comment