38.2 C
Hyderabad
April 29, 2024 11: 26 AM
Slider వరంగల్

ములుగు జిల్లా అభివృద్ధి కమిటీ ఎన్నిక

#mulugudist

ములుగు జిల్లా అభివృద్ధి పై నేడు జరిగిన సమీక్ష సమావేశం లో ములుగు జిల్లా అభివృద్ధి కమిటీ ని ఎన్నుకున్నారు. యువజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు, లాయర్లు, డాక్టర్లు, కుల సంఘాలు, స్వేరో ఆధ్వర్యంలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల బిక్షపతి గౌడ్ అధ్యక్షతన ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

అధ్యక్షులు గా రవికాంత్ అన్నవరం ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులు గా ముంజాల బిక్షపతి, ఉపాధ్యక్షులు గా కొట్టెపాక శ్రీనివాస్, కొలిపాక ప్రశాంత్, గుండాల రఘు, ప్రధాన కార్యదర్శి గా అరిగెల స్వామినాథ్, కార్యదర్శిలు గా బోడ రాజు , కూరెల్ల పరిపూర్ణ చారి, సహాయ కార్యదర్శులుగా మారెపెల్లి నవీన్, గుండెమీది వేంకటేశ్వర్లు, మెడెం శివశంకర్, ప్రచార కార్యదర్శులుగా బైకాని రాజశేఖర్, తాటి పెళ్లి శశి కాంత్, లీగల్ అడ్వైజర్ గా స్వామి నాథ్, బొల్లి సారంగపాణి కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

గిరిజన యూనివర్సిటీ, బస్ డిపో, ఆర్టీఏ ఆఫీస్, మరియు జిల్లా అభివృద్ధి సమస్యల గురించి త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అని ఈ సందర్భంగా వారు తెలిపారు. అధ్యక్షులు గా ఎన్నిక అయిన రవికాంత్ అన్నవరం ను ఘనంగా సన్మానించారు.

Related posts

నూతన సంవత్సర వేడుకలను బహిష్కరించిన టీడీపీ

Satyam NEWS

మానవత్వాన్ని చాటుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే

Satyam NEWS

ఈ ఆఫిస్ ద్వారా ఫైళ్ళ నిర్వహణ

Bhavani

Leave a Comment