25.2 C
Hyderabad
January 21, 2025 10: 47 AM
Slider ముఖ్యంశాలు

సీక్రెట్: అయ్యా ఇదీ కథ.. ఇంకా చెప్పాలా?

ysr cp poll

ఫేస్ బుక్ లో ఒక పేజి ఉంది. దాని పేరు వైఎస్ఆర్ సిపి ఫోరం. ఆ ఫేస్ బుక్ పేజి నిండా ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలసీలను పొగుడుతూ పోస్టులు ఉంటాయి. ఈ ఫేస్ బుక్ పేజి ఇటీవల ఒక పోల్ నిర్వహించింది. పార్టీలకు అతీతంగా మీ అభిప్రాయాలను వెల్లడించండి. మన రాజధాని అమరావతి అయితే బాగుంటుందా…విశాఖపట్నం అయితే బాగుంటుందా… అందరూ పాల్గొనాలని మనవి.

అని ఓటింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ లో మొత్తం 11 లక్షల 38 వేల మంది ఓట్లు వేశారు. 11 వందల కామెంట్లు 2900 షేర్లు వచ్చాయి. అంతా బాగానే ఉంది కదా? మరింకేంటి? అంతా బాగానే ఉంది కదా? మరి అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ పోల్ లో 77 శాతం మంది అమరావతిలో రాజధాని ఉండాలని ఓటేశారు. విశాఖ పట్నంలో రాజధాని ఉండాలని కేవలం 23 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. అయ్యా అదీ కథ. ఇంకా చెప్పాలా?

Related posts

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా స్ట్రెయిన్‌ కలకలం

Satyam NEWS

పరిపాలనా రాజధానికి ప్రత్యేక బస్సు సర్వీసు

Satyam NEWS

రుణ మాఫీ పథకం అమలు తెలంగాణలో కేవలం ఐదు శాతమే

Satyam NEWS

Leave a Comment