తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలకు YSR తెలంగాణ పార్టీ సింగిల్ కో-ఆర్డినేటర్లను వైఎస్ షర్మిల రెడ్డి నియమించారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా కిషోర్ కుమార్ దొంతమాలను నియమించారు. YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు Y.S. షర్మిల రెడ్డి ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఈ సందర్భంగా కిషోర్ కుమార్ దొంతమాల(KKD) తెలిపారు. రాష్ట్రంలో నియోజకవర్గాలకు పార్టీ సింగిల్ కో-ఆర్డినేటర్లను నియమించడంతో పార్టీ కార్యక్రమాలు మరింత చురుకుగా జరిగేందుకు అవకాశం ఏర్పడింది.
previous post