ఆటల పోటీల్లో ప్రతిభ కనపరిచి కేసీఆర్ కప్ గెలుచుకున్న చిన్నారులకు ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ పోటీలకు వెళ్ళడానికి తక్షణ సహాయం కింద 25 వేల రూపాయల చెక్కును ఆయన అందించారు.
ములుగు జిల్లా గోవిందరావు పేట మండల కేంద్రంలో పస్రా గ్రామంలో సేంట్ మేరీ స్కూల్ చెందిన విద్యార్థిని, విద్యార్థులు గత నెల కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన క్రీడలలో విజయం సాధించారు. గోవా లో జరిగే ఏషియా అంతర్జాతీయ కప్ పోటీలలో పాల్గొనేందుకు ఈ క్రీడాకారులను పంపాలని అందుకు అయిన ఖర్చులకు
25 వేల రూపాయలు ఇస్తున్నానని చెప్పిన జెడ్పీ చైర్మర్, ఆ చెక్కు ను అక్కడిక్కడే కరస్పాండెంట్ స్టీపెన్ రెడ్డి కి అందజేశారు. మారుమూల ప్రాంతాలకు చెందిన ఈ క్రీడాకారులు బంగారు, కాంస్యం, రజత పతకాలు సాధించి జిల్లాకు మండలానికి తల్లిదండ్రులుకు,ఉపాధ్యాయులకు,కోచ్ కు మంచి పేరు తీసుకొని రావాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ ను స్కూలు యాజమాన్యం సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నిక నియోజకవర్గ కన్వీనర్ పోరిక గోవింద్ నాయక్, మైనార్టీ నాయకులు తాహిర్ పాషా,జి.కృష్ణ రెడ్డి,రాష్ట్ర యువజన నాయకులు ఎర్వ వెంకటాద్రి, ములుగు నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి నెమలి బాలకృష్ణ, పిఏసీఎస్ డైరెక్టర్ దూడపక రాజేందర్, మండల అధ్యక్షులు మురహరి భిక్ష పతి, ఉపాధ్యక్షుడు అజ్మిరా సురేష్ నాయక్, లాకావత్ నర్సింహా నాయక్, రైతు బంధు అధ్యక్షులు పిన్నటి మధు సుధన్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు వర్ధం చందర్ రాజు, బాణోత్ వెంకన్న, జన్నురాంబాబు, రుద్రబోయిన మల్లేష్, సీనియర్ నాయకులు రాజు నాయక్, ఉట్ల మోహన్, రాజశేఖర్, మువ్వ భాను పాల్గొన్నారు.