మాంసం కోసం ఆవులను చంపడాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని హిందూ వాహిని తీవ్రంగా ఖండిస్తున్నది. నిన్న రాత్రి ఇక్కడి ఒక గోశాల నుంచి కొందరు రెండు ఆవులను కొనుగోలు చేశారు. వాటిని చంపి మాసం అమ్మాలని వారి ఉద్దేశ్యం కావడంతో హిందూ వాహిని కార్యకర్తలు వారిని వెంబడించారు. రాత్రి అంతా వారు వెతగా ఒక చోట ఆవులు కనిపించాయి. దాంతో వారు ఆవులను స్వాధీనం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులు వారిపై కేసు పెట్టకుండా తాత్సారం చేస్తున్నారని హిందూ వాహిని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆవులను కొనుగోలు చేసిన వ్యక్తి టిఆర్ఎస్ నాయకుడు కావడమే దీనికి కారణమని వారు అంటున్నారు. టిఆర్ఎస్ నాయకుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని దీనిపై ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చిరించారు.