అధికారం శాశ్వతం కాదనే విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులను హింసించే సమయంలో ఆయన అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తు పెట్టుకుంటే ఆయనకే మంచిదని దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతీకారవాంఛ ఎక్కువైందని దివాకర్రెడ్డి దుయ్యబట్టారు. అమరావతిలో జేసీ మీడియాతో మాట్లాడారు. నాలుగు రోజులు జైల్లో పెట్టినా పర్లేదు అని ధైర్యంగా నిలబడితే పోయేదేమీ లేదని ఈ సందర్భంగా జేసీ వ్యాఖ్యానించారు. బస్సులు, ఇతర ఆస్తుల విషయంలో తనపైనా అనేక ఒత్తిళ్లు తెస్తున్నారని జేసీ ఆరోపించారు. అధికారుల మీద ఎదురు కేసులు వేయటం ప్రారంభించడంతో వాళ్లు కాళ్ల బేరానికి వస్తూ పైవాళ్ల ఒత్తిడి అంటూ చెబుతున్నారన్నారు. రోజూ కేసుల గొడవ ఎందుకని.. ట్రావెల్స్ వ్యాపారం కొంతకాలం మానేయ్యాలని అనుకుంటున్నానని జేసీ చెప్పారు. నాలుగు రోజులు బస్సులు నిలిపేస్తే బాగుంటుందనే ఆలోచనతో తాను ఉన్నట్లు తెలిపారు.
previous post