26.7 C
Hyderabad
April 27, 2024 07: 06 AM
Slider జాతీయం తెలంగాణ

22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు బ్యాంక్ ల సమ్మె

PUBLIC-SECTOR-BANKS-INDIA

జాతీయ బ్యాంక్ ల విలీనాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు బ్యాంక్ ల సమ్మె చేస్తున్నట్లు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాంబాబు తెలిపారు. హిమాయత్ నగర్ లోని కామ్రేడ్ సత్యనారాయణ భవన్ లో నేడు ​తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ ​​సమావేశంలో​ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ​ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఇటీవల ​ప్రభుత్వ రంగ బ్యాంక్ లను నాలుగు బ్యాంక్ లు గా విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను తీవ్రంగా నిరసిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ​అక్టోబర్ 22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు ​బ్యాంక్ ల​ సమ్మె చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ల విలీనం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తిరోగామి చర్యగా ఆయన అభివర్ణించారు. 10 బ్యాంకులు 4 బ్యాంకులు గా విలీనమై పోతే  ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 కు తగ్గిపోతుందని, ​ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడం విలీనాలతో బ్యాంకుల ప్రేవేటీ కరణకు దారితీస్తుందని ఆయన అన్నారు. ఈ చర్యతో ​గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుప్ప కులుతుందని ఆయన తెలిపారు. ​బ్యాంకుల విలీనం తో ఉద్యోగులు తగ్గిపోతారని దీంతో నిరుద్యోగ సమస్య పెరిగి పోతుందని ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వం ​బ్యాంక్ ల సంస్కరణల పేరుతో కార్పొరేట్ లకు దగ్గర అవుతుందని ఆయన ఆరోపించారు

Related posts

న్యూ వైరస్ :మీడియాకు బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ వ్యాధి

Satyam NEWS

కొత్త సంవత్సరంలో సరికొత్త ఇండస్ట్రియల్ పాలసీ

Satyam NEWS

మారువేషాల్లో విజయవాడకు అంగన్వాడీలు

Bhavani

Leave a Comment