కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ ప్రగతిలో 06,10,11,12,13,16 వార్డుల కౌన్సిలర్స్ పట్టణ ప్రగతి ప్రణాళికలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 16వ వార్డు కౌన్సిలర్ నరసింహారావు, 6వ వార్డు కౌన్సిలర్ రమ్య నాగరాజు,10వ వార్డు షేక్ రహీం పాషా, 13వ వార్డు కౌన్సిలర్ మేకల శిరీష కిరణ్ యాదవ్,11వ బోరెల్లి కరుణ మహేష్,12వ వార్డు హేమావతి ఎల్లా గౌడ్,ఛాలెంజ్ గా తీసుకొని వార్డును అభివృద్ధి బాటలో నడిపించడానికి నడుం బిగించారు.
ప్రణాళికలో ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకొని పని చేస్తున్నారు. వార్డులోని ముళ్ళ పొదలు జెసిబిలతో తొలగిస్తున్నారు. అదేవిధంగా రోడ్లు,డ్రైనేజీ, విద్యుత్ ఇతర సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించారు. సమస్యలను సేకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అధికారులతో మాట్లాడి మిషన్ భగీరథ పనులలో వేగవంతంగా పనిచేపిస్తున్నారు. వార్డు ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా హరితహారం మొక్కలు సంరక్షణ పనులను చేసే పనిలో పడ్డారు. అనేక చర్యలు తీసుకుంటున్నారు .కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉత్తమంగా నిలవడానికి పోటీ పడుతూ ప్రణాళికలో పాల్గొంటున్నారు. మొత్తం మీద వార్డులో ప్రగతి సాధించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. చైర్మన్ రఘుప్రోలు విజయ లక్ష్మి చంద్రశేఖర చారి ప్రతి వార్డును పరిశీలిస్తున్నారు.