బిచ్కుంద మండల కేంద్రంలో కరోనా మహమ్మారి పుణ్యమాని కొంత మంది చేతి వృత్తుల వారికి పని లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా బిచ్కుందలో పాత ఇనుప బాసన్లు అమ్ముకుంటూ వీరముష్టి కులానికి చెందిన కొన్ని వలస కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. వీరికి గత పది రోజుల నుండి ఎటువంటి పనులు లేకపోవడంతో చిన్న పెద్దలందరూ ఆకలితో అలమటిస్తున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న పన్నెండు కిలోల బియ్యం వీరిలో కొంత మంది లబ్ధిదారులున్నారు. దీంతో వీరి విషయం తెలుసుకున్న తొమ్మిదవ వార్డు పంచాయితీ సభ్యుడు పత్తి లింగురామ్ తన సొంత ఖర్చులతో భోజనాన్ని వడ్డించి మంది కుటుంబ సభ్యుల ఆకలి తీర్చారు. దీంతో ఆయన ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.