నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పీ యస్ ఆర్ యూత్ ఆధ్వర్యంలో శనివారం టీఆర్ఎస్ నాయకులు కోటగిరి మండల పరిధిలో డ్యూటీ చేస్తున్న పోలీసు, రెవెన్యూ, హెల్త్ శాఖల అధికారులకు, నిరుపేదలకు 100 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టీఆరెస్ మండల నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు పోచారం శ్రీనివాసరెడ్డి యూత్ ఆధ్వర్యంలో కరోనా నివారణకై సేవలందిస్తున్న పలు శాఖల అధికారులకు, పూట గడవని నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు అందజేస్తున్నట్టు తెలిపారు.
ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఈనెల 14 వరకు ఇదేవిధంగా ప్రతిరోజూ భోజనం ప్యాకెట్లు పంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ యూత్ విభాగం నాయకులు అరవింద్, రాజాగౌడ్, శివ, గంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.