37.2 C
Hyderabad
April 26, 2024 21: 13 PM
Slider ముఖ్యంశాలు

ఫ్యాక్ట్ ఫైండింగ్: అసత్య ప్రచారాలే ఢిల్లీ అల్లర్లకు కారణం

kishan reddy

కొందరు మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేయడం వల్లే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో ఏర్పాటు చేసిన ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా-2020’ ఐఎస్‌బీ పాలసీ కాంక్లేవ్‌ను ఆయన నేడు ప్రారంభించారు.

కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొట్టాయని ఆయన అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టిన వారే ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ఆయన అన్నారు.  పోలీసు అధికారులను కూడా కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి చొరబాటుదారులు ఎక్కువయ్యారని, విధ్వంసాలు సృష్టిస్తున్నారని అన్నారు.  గడచిన ఆరేళ్లలో నరేంద్రమోదీ అనేక గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. నోట్ల రద్దు, ఆర్టికల్‌-370 రద్దు, జీఎస్టీ వంటి సాహసోపేత నిర్ణయాలతో పాటు జన్‌ధన్‌ యోజనవంటి కీలక నిర్ణయాలు అందులో ఉన్నాయని తెలిపారు.

Related posts

పెర్కెట్ మహిళా ప్రాంగణంలో ఎస్సి మహిళా అభ్యర్థులకు శిక్షణ

Satyam NEWS

తెలంగాణాలో షర్మిలను ఆదరిస్తారా ! కాదు పొమ్మంటారా ?

Satyam NEWS

మధు వాకిటి యు ట్యూబ్ కి ఉత్తమ పురస్కారం

Satyam NEWS

Leave a Comment