ముఖ్య మైన విషయం మాట్లాడేది ఉంది మాట్లాడుకుందాం రమ్మని మునిగాల హారతి కి షాహిద్ మెసేజ్ పంపాడని, దీనితో గదికి వచ్చిన ఆమెను తన వద్ద ఉన్న కీ చైన్ లో ఉన్నకత్తితో గొంతు కోసి హతమార్చాడని సీపీ రవీందర్ తెలిపారు.హన్మకొండలోని రామ్నగర్లో యువతి మునిగాల హారతి హత్యకేసు లో నిందితుడు షాహిద్ ని పోలీసులు అరెస్టు చేశారు.
షాహిద్ యువతి గొంతు కోసి హత్య చేసి అనంతరం జైలుకు వెళ్లి అధికారులకు హత్య విషయం తెలిపాడని సీపీ వెల్లడించారు. ఈ కేసు వివరాలను సీపీ రవీందర్ మీడియాకు వెల్లడించారు. యువతికి షాహిద్తో 2016లో పరిచయం ఏర్పడిందని ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ తో చనువుగా ఉంటుందని ,తనను కాదంటుందనే కోపం తో నే యువతిని షాహిద్ చంపినట్లు విచారణలో తేలిందన్నారు.
ఇళ్లను అద్దెకు ఇచ్చేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని ,గుర్తింపు కార్డులను చూపి అద్దెకు ఇవ్వడం మంచిదని చెప్పారు. అద్దె ఇంట్టోకి ఎవరెవరు వస్తున్నారో చూసుకోవాలసైనా బాధ్యత యజమాని దే నని అన్నారు. అన్ని ఆధారాలతో ఛార్జిషీటు దాఖలు చేస్తామని సీపీ రవీందర్ తెలిపారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు.