కడప జిల్లా రాజంపేట లోని ఉర్దూ జూనియర్ కాలేజీ దశాబ్ది ఉత్సవాలు నేడు ఇక్కడ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యార్ధులు కష్టపడి చదువుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
కళాశాల మరోన్నో సంవత్సరాలు మంచి విద్యార్ధులను సమాజానికి అందించాలని ఆయన ఆకాంక్షించారు. వివిధ రంగాలలో విజయం సాధించిన విద్యార్ధులకు అకేపాటి జ్ఞాపికలు అందచేశారు. అదే విధంగా వార్షిక పరీక్షలో అధిక మార్కులు వచ్చినవారికి ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.