టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు దుబాయ్ స్టేడియం ఫుల్ కానుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అనుమతి లభించినందున దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 25,000 సీట్లు అభిమానులకు అందుబాటులోకి వచ్చాయి.
నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు 70శాతం సామర్థ్యంతోనే మ్యాచ్లను నిర్వహించారు. అయితే ఫైనల్కు మాత్రం దుబాయి మైదానంలో పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు అనుమతించనున్నారు. ఈ టీ20 ప్రపంచకప్లో ఇప్పటికే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరాయి.
తొలి సెమీస్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబర్ 11న జరగనున్న రెండో సెమీస్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు సెమీఫైనలల్లో గెలించిన జట్లు నవంబర్ 14న దుబాయి వేదికగా ఫైనల్లో తలపడతాయి.