రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగే ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్ష లకు 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించవచ్చని, ఆ తర్వాత లోపలికి రానివ్వొద్దని ఇంటర్ బోర్డు కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు చదివే కళాశాలల్లోనే రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రయోగ పరీక్షలు జరుపుతారు.
ఒక కళాశాలలోని విద్యార్థుల్లో 25 శాతం మంది కంటే 30కి 30 మార్కులు వచ్చిన వారితో పాటు 27-30 మార్కులు వచ్చిన వారి జవాబుప త్రాలను కూడా తాము మరోసారి పునఃపరిశీలన చేస్తా మని స్పష్టం చేశారు. ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేయకుంటే ఆ కళా శాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలకు రూ.5 వేల జరి మానా విధిస్తామని హెచ్చరించారు.
విద్యార్థులకు ఎగ్జా మినర్లు వేసిన మార్కులను అదేరోజు రాత్రి 8 గంటల లోపు ఆన్లైన్లో బోర్డుకు పంపాలి. జాగ్రఫీ విద్యార్థులకు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రయోగ పరీక్షలు జరుగుతాయి. ఆదివారం నుంచి ఆన్లైన్లో ప్రాక్టికల్ పరీక్షల హల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డ్ పేర్కొంది.