వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 26న జరిగే రాష్ట్ర పోరాట దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం ఖాసీం హాజరు అవుతారని విహెచ్ పిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొజ్జ జీవరత్నం తెలిపారు . వికలాంగుల పించను 3016 రూపాయల నుండి 6000 వరకు పెంచాలని , వికలాంగుల బంద్ ను అమలు చేయాలని, బాక్ లాగ్ పోస్టులను బర్తరఫ్ చేయాలని , పింఛన్ల ఏరివేత జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుడిబండ్ల సురేష్ , జిల్లా కార్యదర్శి ఇనుప ఉపేందర్ , టౌన్ అధ్యక్షులు బిక్షమయ్య , చింతకాని మండల అధ్యక్షులు మెరా నాగేశ్వరావు , విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీను పాల్గొన్నారు .