28.7 C
Hyderabad
April 26, 2024 09: 16 AM
Slider ముఖ్యంశాలు

14న అంబేద్కర్ జయంతి నుంచి బండి రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్ర

#bandisainjai

ఈ నెల 14 వ తేదీ నుంచీ తాను రెండో సారి ప్రారంభించనున్న మలివిడత ప్రజా సంగ్రామ యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు కేసీఆర్ ప్రభుత్వం యత్నాలు ప్రారంభిస్తున్నట్లు సమాచారం అందుతోందని ఎన్ని అడ్డంకులు సృష్టించిన.. చేపట్టిన కార్యంపై తగ్గేదే లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేసారు.

ఈనెల 14 నుండి జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, తమిళనాడు రాష్ట్ర్ర సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు, మాజీ మంత్రులు విజయరామారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, జి.వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,  దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయ పక్షం కార్యక్రమం

పార్టీకి చెందిన పలువురు జాతీయ నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల పార్టీ తరపున చేపట్టిన కార్యక్రమాలతోపాటు ఈనెల 7 నుండి 20 వరకు  ‘సామాజిక న్యాయ పక్షం’  పేరిట చేపట్టే కార్యక్రమాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రైతు సదస్సులు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వంటి అంశాలపై సమీక్షించారు.

రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ను సమావేశంలో పాల్గొన్న నేతలకు బండి సంజయ్ పరిచయం చేశారు.  

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ కరెంట్ ఛార్జీల పెంపు విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సిందే. కేసీఆర్ మెడలు వంచి పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించేదాకా ఉద్యమించాలి. అదే సమయంలో వడ్ల కొనుగోలు వ్యవహారంలో రైతులకు ఇబ్బంది కలిగించేలా కేసీఆర్ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలతోపాటు  టీఆర్ఎస్ నేతల తప్పిదాలను ప్రజల్లోకి వెళ్లి విస్త్రతంగా ఎండగట్టాలన్నారు.

కరెంట్ ఛార్జీలపై ఆందోళనలు చేసే సమయంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు టీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించే ప్రమాదం ఉంది. ఈ విషయంలోనూ టీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిని పూర్తిగా ఎండగడతాం. ఎందుకంటే వ్యాట్ పేరుతో ఒక్కో లీటర్ పెట్రోలుపై 32ల చొప్పున టీఆర్ఎస్ సర్కార్ ప్రజల నుండి వేల కోట్ల రూపాయలు దోచుకుంటోందని ఆరోపించారు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుండటం బాధాకరమే అయినప్పటికీ… కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించి ప్రజలకు కొంత మేరకు ఊరట కలిగించింది. చాలా రాష్ట్రాలు కేంద్రం స్పూర్తితో వ్యాట్ ను తగ్గించి ఆయా రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం కలిగించారు. కానీ కేసీఆర్ మాత్రం వ్యాట్ తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతూనే ఉన్నారు.

పెట్రోలు ధర ఎంత పెరిగితే… అంతగా వ్యాట్ పేరుతో రాష్ట్రానికి అంత ఎక్కువగా దండుకుంటున్నారు. ఆ వివరాలన్నీ నాయకులందరికీ పంపుతాం. ప్రజలకు ఈ విషయాలను వివరించి టీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

యాత్ర ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలి

ఈనెల 14 నుండి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఆరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పోలింగ్ బూత్ ల వారీగా ఘనంగా నిర్వహించాలి. అనంతరం సాయంత్రం జోగులాంబ గద్వాలలో ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభిస్తాం. యాత్ర ప్రారంభానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలన్నారు.. ఎంపీ బండి సంజయ్.

సీఎం కేసీఆర్ కు ప్రజా సంగ్రామ యాత్రను చూసి భయం పట్టుకుంది. టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అయిందనే అక్కసుతో యాత్రను అడ్డుకునేందుకు ఏం చేయాలనే అంశంపై ఇటీవల ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశం నిర్వహించినట్లు సమాచారం వచ్చిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది జాగ్రత్త

ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్న సమయంలో రైతుల ముసుగులో దాడులు చేయాలని, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి యాత్రకు వెళ్లకుండా అడ్డుకోవాలని ఆ సమావేశంలో స్కెచ్ వేసినట్లు తెలిసిందన్నారు.ప్రజల కోసం ఎన్ని దాడులనైనా భరిద్దాం… మనమంతా సంయమనంతో ఉందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురుదాడి చేయబోం. ప్రజల కోసం రాళ్ల దాడులను భరించేందుకైనా సిద్ధం కావాలి. సీఎం ఎన్ని కుట్రలు చేసినా.. మరెన్ని దాడులకు తెగబడ్డా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామని ఎంపీ బండి సంజయ్ అన్నారు.

సీఎం కేసీఆర్ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని రైతుల కోసం గంట సేపు ఢిల్లీలో దీక్ష చేయలేనోడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తానని చెప్పడం నవ్వొస్తుందన్నారు. అందుకే కేసీఆర్ మాటలను జనం నమ్మడం లేదన్నారు. టీఆర్ఎస్ పనైపోయిందని ఆయనకూ తెలిసిపోయింది. అందుకే రోజుకో డ్రామాలు చేస్తున్నాడని ఆరోపించారు.

ప్రజా సంగ్రామ యాత్రకు పూర్తి సమయం కేటాయించి అడుగులో అడుగు వేసి తనతోపాటు నడిచేందుకు వేలాది మంది కార్యకర్తలు, యువకులు ముందుకొస్తున్నారని వారందరికీ హ్రుదయ పూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానంటూ ముగించారు..బండి సంజయ్.

Related posts

ఎన్‌ఎం‌సి సంతృప్తి చెందాలి

Murali Krishna

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

ఎగ్జిట్ పోల్స్ : ఢిల్లీలో అధికారం ఆమ్ఆద్మీ పార్టీదే

Satyam NEWS

Leave a Comment