సొంత స్థలాలున్న వారు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకునే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుంది. వారం రోజుల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన జరిగే సమీక్షలో విధివిధానాలు ఖరారు చేయనుండగా సొంత స్థలాలున్న వారికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థికసాయం అందించనుంది. ఒక్కో ఇంటికి పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ఎంతెంత జాగా ఉండాలి? ఒక్కో ఊరికి ఎన్ని ఇవ్వాలి? లబ్దిదారుల ఎంపిక ఎలా అనేది ఖరారు చేయనున్నారు. ఎన్నికలకు ముందస్తుగా వెళ్లాలనే ఆలోచన వస్తున్న నేపధ్యంలో ఈ పథకాన్ని వెంటనే ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతున్నది.
previous post
next post