బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచీ స్వాతంత్ర్యం పొందిన భారతదేశం…74వ గణతంత్ర దినోత్సవాన్ని యావత్ దేశం జరుపుకుంటున్న సందర్భాన…విజయనగరం పరేడ్ గ్రౌండ్ లో 74 గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. పరేడ్ నుంచి విజయనగరం జిల్లా ఎస్ పై దీపిక గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ సూర్య కుమారి జాతీయ పతాకాన్ని ఎగురవ వేసారు.
విజయనగరం కలెక్టరేట్ లో జెండా ఎగురవేసిన జేసీ మయూరి అశోక్..!
భావి తరాలకు రాజ్యాంగ స్ఫూర్తిని అందించాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పిలుపు నిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, స్వాతంత్ర సమర యోధులు రగిల్చిన స్పూర్తి, దేశభక్తి మనందరికీ ఆదర్శనీయమని అన్నారు. దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని, 2047 నాటికి అభివృధి చెందిన దేశం గా చూడాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు సూర్య నారాయణ, పద్మలత, ఐ సి డి ఎస్ పిడి శాంతకుమారి, డీఈవో లింగేశ్వర రెడ్డి,. జిల్లా వ్యవసాయ శాఖాధికారి త్రినాథస్వామి సర్వే శాఖ ఏడి త్రివిక్రమరావు, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.