చేపల వేటకు వెళ్లి చెరువులో పడి చెంచు వ్యక్తి మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం చెంచు కాలనీకి చెందిన ఉడుత నూరి బీసయ్య 32 బుధవారం సమీప వెంకటేశ్వర్ల బావి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. రెండు రోజులు గాలించిన మృతదేహం లభ్యం కాకపోవడంతో ఫైర్ సిబ్బంది చెరువులోకి దిగి గురువారం వెలికి తీశారు. చనిపోయిన బీసయ్య కు భార్య అరుణతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
previous post