సిసి రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి అధికారులను అదేశించారు. ఏకలవ్య నగర్ డ్రైనేజ్ సమస్య నూతనంగా నిర్మిస్తున్న టువంటి సిసి రోడ్డు పనుల్లో కారణంగా వాటర్ పైప్లైన్ పగిలి పోవడంతో వాటర్ వర్క్స్ ఏఈ మాజీద్ కి త్వరగా పగిలిపోయిన పైపులైను సమస్య పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా తురాబ్ నగర్, ఇరానీ హోటల్ బస్ స్టాప్ లో ముత్యాలమ్మ గుడి ఎదురుగా గల ప్రజయ్ ఎవెన్యూ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాలలో డ్రైనేజీ సమస్య పరిష్కరించే వలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది బాలకృష్ణ, లక్ష్మణ్ తో పాటు జిహెచ్ఎంసి ఏఈ ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి జోగులాంబ గద్వాల్ జిల్లా బీజేపీ ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి.కృష్ణ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి జమ్మిచట్టి బాలరాజ్, మిరియాల శ్రీనివాస్, గోవింద అర్జున్, దేవరుప్పల రమేష్, ఆర్.రామ్ రెడ్డి, బాలకృష్ణ గౌడ్, దుర్గాప్రసాద్, ముఖేష్ గౌడ్, యోగేష్ మరియు స్థానిక బస్తీవాసులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట