ఆవేశం అనర్ధ దాయకం అంటారు పెద్దలు ఆ ఆవేశమే అతన్ని కటకటాలు లెక్క పెట్టెలా చేసింది.వివారాలల్లోకి వెళితే పక్కింటివాళ్ల కుక్క తన భార్యను కరిచిందన్న కోపంలో ఓ వ్యక్తి ఆ కుక్కను తన రైఫిల్తో కాల్చి చంపేశాడు ఓ ప్రబుద్దుడు.మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకోగా గురువారం నిందితుడు నరేంద్ర విశ్వయ్యను పోలీసులు అరెస్టు చేశారు. తన వద్ద ఉన్న రైఫిల్తో కుక్కను కాల్చాడని మెడలోకి బులెట్ దూసుకుపోవడంతో కుక్క అక్కడిక్కడే చనిపోయిందని జంతువును చంపినందుకు అతడిపై అనిమల్ ప్రొటెక్షన్ ఆక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ లు తెలిపారు.కాగా ఆ కుక్క తన భార్యనే కాకుండా ఇరుగు పొరుగు వారిని కూడా పలుమార్లు కరిచిందని నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడి ఆరోపణల్లో వాస్తవం ఉందని తెలితే ఆ కుక్కును పెంచుకుంటున్న వారిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.